రుణం పేరుతో దారుణాలు చేసే అత్తగా ఆమని!
on Jul 26, 2021
రుణం పేరుతో దారుణాలు చేసే అత్తగా ఆమని బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ తెలుగులో త్వరలో కొత్త సీరియల్ రాబోతోంది. దాని పేరు 'ముత్యమంత ముద్దు'. అందులో వడ్డీకి డబ్బులు ఇచ్చి, తర్వాత ముక్కుపిండి మరీ వసూలు చేసే మహిళగా ఆమని కనిపించనున్నారు. ఆమె కుమారుడేమో కన్నవాళ్ల రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. తర్వాత ఏమైందనేది సీరియల్ లో చూడాలి. త్వరలో ఈ సీరియల్ ప్రసారం కానుంది. దీనికి 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టితో ప్రచారం చేస్తున్నారు.
'ముత్యమంత ముద్దు' సీరియల్ కాన్సెప్ట్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఓ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడికి కృతి శెట్టి వస్తుంది. పక్కనున్న నిషా రవిక్రిష్ణన్ (సీరియల్ హీరోయిన్)తో 'పెళ్లి తర్వాత అమ్మాయి జీవితమే మారిపోతుంది కదా. ఇంటిని వదులుకోవాలి. ఇంటి పేరు మార్చుకోవాలి. అమ్మానాన్నను దాదాపు మర్చిపోవాలి' అంటుంది.
అప్పుడు కృతితో నిషా రవిక్రిష్ణన్ 'నువ్వు అమ్మాయి గురించి యోచన చేస్తూ ఉండావు. నాను అమ్మాయి అప్పా అమ్మ గురించి బాధ పడుతూ ఉన్నాను. వీళ్లకు కొడుకులు లేరు. మాలాగా ఇద్దరూ కూతుళ్లే. ఇన్నాళ్లూ కూతుళ్లే ప్రాణంగా బతికేశారు. ఇప్పుడు అత్తారింటికి పోయేది కూతురు కాదు. వాళ్ళ ప్రాణం. ఈ క్షణం నుండి ఆ అమ్మ అప్పా అనాథలే కదా. నాకు మాత్రం అలా కాదు. అబ్బాయి పెళ్లి చేసుకుని అమ్మ అప్పాను వదిలేస్తాడా? వాళ్లతో కలిసే కదా ఉంటాడు. అట్నే నన్ను చేసుకోబోయేవాడు కూడా మా అమ్మ, అప్పాను అత్తారింట్లో ఉండనిస్తేనే నేను పెళ్ళికి ఒప్పుకుంటా' అంటుంది.
నిషా రవిక్రిష్ణన్ కండిషన్లకు సిద్దు ఓకే అంటాడు. 'అబ్బాయి సరే. కానీ, నీకు కాబోయే అత్తగారు ఈ కండిషన్ కు ఒప్పుకుంటారా?' అని కృతి ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆమని ఎంట్రీ. పెళ్లింట్లో సారెను తీసుకెళ్లే కర్కశమైన మహిళగా ఆమనిని చూపించారు. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సీరియల్ ఎలా ఉంటుందో టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి.
Also Read